హైదరాబాద్ : ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ఎం. సలావుద్దీన్ జావీద్(65) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం స్వల్ప అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. జావీద్కు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హైదరాబాద్, మిడిల్ ఈస్ట్ దేశాలలో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తుల్లో ఎం ఎస్ జావీద్ ఒకరు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఛాంపియన్షిప్లలో పాల్గొన్నారు.
జావీద్ 1980ల ప్రారంభంలో స్టార్ కరాటే క్లబ్ను ప్రారంభించాడు. అనంతరం కాలంలో తన కొడుకుల సహాయంతో దానిని కొనసాగించాడు. స్టార్ కరాటే క్లబ్ తెలంగాణ అంతటా అనేక శాఖలను ఏర్పాటు చేసింది. ఇక్కడ యువకులు వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతారు.
శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న జావీద్ను కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఫతే దర్వాజాలోని మసీదు-ఎ-వజీర్ అలీ వద్ద తుది ప్రార్థనలు నిర్వహించబడతాయి. మీర్ ఆలం ఈద్గా వద్ద ఉన్న శ్మశానవాటికలో ఖననం చేయనున్నారు.