షాబాద్, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పోన్న స్వప్నారెడ్డితో కలిసి వివిధ గ్రామాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 19 మంది లబ్ధిదారులకు రూ. 6.23లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ కృషి
శంకర్పల్లి, ఏప్రిల్ 12 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ తరహాలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. సోమవారం శంకర్పల్లి పురపాలక ప్రత్యేక బడ్జెట్ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు కూడా పట్టణాలుగా మారాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి నిధులు అందిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ మొక్కలను వార్డు కౌన్సిలర్లు, అధికారులు కాపాడాలని కోరారు. 2021-2022 బడ్జెట్ను కౌన్సిలర్లు ఆమోదించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ
శంకర్పల్లి రూరల్, ఏప్రిల్ 12 : బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మండల పరిధిలోని పర్వేద గ్రామంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందు కు సాగాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ వెంకట్రెడ్డి, ప్రవీణ్కుమార్, యాదయ్య రిటైర్డ్ అడిషనల్ డీసీపీ, రంగారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.