ఎయిర్పోర్టులో ప్రయాణికుడి నుంచి స్వాధీనం
శంషాబాద్, ఏప్రిల్ 12: హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.17 లక్షల విలువైన విదేశీ కరెన్సీని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ అధికారులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. దుబాయ్ వెళ్లేందుకు విమానం నంబర్ ఎఫ్జెడ్ 8780 లో ఎక్కేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. సదరు వ్యక్తి విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్నట్టు అనుమానం అందడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అనుమానించి అదుపులోకి తీసుకొని తనిఖీచేశారు. అతని వద్ద సౌదీ అరేబియా కరెన్సీ ఉన్నట్టు గుర్తించారు. నిందితుడితోపాటు కరెన్సీని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.