హన్వాడ, మే 1 : మండల కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌడ్ నిర్వహించాలని స్థా నిక వ్యాపారులు నిర్వహించారు. శనివారం గ్రామ పం చాయతీ కార్యాలయంలో సర్పంచ్ రేవతి అధ్యక్షతన గ్రా మంలోని వ్యాపారులు, దుకాణాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కా ర్యదర్శి వెంకటయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ఇ ప్పుటి వరకు 15 నుంచి 25 మంది కొవిడ్ బారిన పడ్డారన్నారు. అందుకే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వర కు వ్యాపారాలు నిర్వహించుకోవాలని, తర్వాత దుకాణాలను మూసి ఉంచాలని నిర్ణయించారు. ఇందుకు ప్ర తి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఎవరైనా నిబ ంధనలు ఉల్లంఘిస్తే వారికి రూ.2 వేల జరిమానా తప్పదని హెచ్చరించారు. అత్యవసరం ఉంటే మాస్కులు ధ రించి బయటకు రావాలన్నారు.