కంటోన్మెంట్, సెప్టెంబర్ 2: సికింద్రాబాద్లో అన్ని హంగులతో సెట్విన్ శిక్షణ కేంద్రంలో త్వరలోనే కార్యకలాపాలకు నోచుకోనుందని, ఈ కేంద్రంలో శిక్షణ పొందే వారికి కచ్చితంగా ఉపాధి లభించేలా ఏర్పాట్లు జరుపుతామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్ మండీలో కొత్తగా నెలకొల్పిన సెట్విన్ శిక్షణ కేంద్రంలో గురువారం మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ.. అత్యంత అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్రావు, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్తో పాటు టీఆర్ఎస్ నేతలు కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.