గోల్నాక, ఆగస్టు 25 : అంబర్పే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇందుకు సంబంధించి కొత్త పైప్లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం గోల్నాక డివిజన్లోని శాంతినగర్లో రూ.7 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పలు ప్రాంతాల్లో భవిష్యత్తులో ఎలాంటి మురుగు సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. కార్పొరేటర్ దూసరి లావణ్య మాట్లాడుతూ..డివిజన్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారును ఆదేశిచారు.
కార్యక్రమంలో జలమండలి ఏఈ రోహిత్, టీఆర్ఎస్ నాయకులు భూపతి లక్ష్మణ్, ఆర్ రాము, ఆర్కే బాబు, కట్టెల సతీష్కుమార్, సతీష్, అనిల్, భిక్షపతి, లింగంగౌడ్, బుచ్చిరెడ్డి, నర్సింగ్యాదవ్, అబ్బు, ప్రభాకర్, ఉమేష్, మల్లేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.