వనస్థలిపురం, ఆగస్టు 25 : రోషన్దౌలా నుంచి కాళీచేసి వెళ్తున్నవారికి సకాలంలో నష్టపరిహారం అందజేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ను కలిసి మాట్లాడి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలో మొత్తం 612 ఇండ్లు ఉన్నాయన్నారు. ఆ ప్రాంతంలో రక్షణ శాఖ అవసరాలు, భద్రత దృష్ట్యా ఇండ్లు కాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు.
అందుకుగాను వారికి రావాల్సిన నష్టపరిహారం విషయంలో ఆలస్యం జరిగిందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రకాశ్, డేవిడ్, అబ్రహం, జంగన్న, అడివయ్య, రాజుగౌడ్, పెంటయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.