డీఎంహెచ్వో డాక్టర్ కే లలితాదేవి
మూడు నుంచి 19 సంవత్సరాల వారికి పంపిణీ
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 12 : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 22 వరకు డీవార్మింగ్ (నట్టల నివారణ మందుల పంపిణీ) కార్యక్రమం నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్ కే లలితాదేవి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కరోనా నిబంధనలను పాటి స్తూ 19 సంవత్సరాలలోపు ఉన్న 2,86,324 మందికి తగిన మోతాదులో ఆల్బెండజోల్ (నట్టలనివారణ మాత్రలు) పంపిణీ చేయడానికి ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లతో తగిన విధంగా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. రెండు సంవత్సరాల వయస్సు కలిగిన వారికి 1/2 మాత్ర అందించాలని, రెండు నుంచి మూడు సంవత్సరాల వారికి ఒక మాత్ర, మూడు నుంచి 19 సంవత్సరాల వారితో ఒక మాత్రను నమిలి మింగించాలని సూచించారు. కరోనా కారణంగా పాఠశాలలు లేకపోవడంతో ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలని పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి, కరోనా బాధితులకు మాత్రలు అందించకూడదని అన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ గీతాలక్ష్మి మాట్లాడుతూ పంపిణీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్వో డాక్టర్ మదన్మోహన్రావు, సర్వేలైన్స్ అధికారి డాక్టర్ శ్రీకృష్ణారావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ యాకూబ్పాషా, డీటీసీవో డాక్టర్ మల్లికార్జున్, అశోక్రెడ్డి, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆర్బీఎస్కే వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మ్యూజిక్ ఇండస్ట్రీలోకి జెమిని గ్రూప్
హార్దిక్ పాండ్యా కొడుకుతో ఆడుకుంటున్న కృనాల్, పంకూరి