హైదరాబాద్ : మహిళలు, పిల్లల రక్షణ కోసం అదేవిధంగా వారికి సహాయంగా రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమశాఖ భరోసా కేంద్రం ఏర్పాటు చేసి నేటికి ఐదేళ్లు. ఈ సందర్భాన్ని పూర్తిచేసుకుని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్స్), షీ టీమ్స్, భరోసా సెంటర్స్ ఇంఛార్జీ శిఖా గోయల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఐదేళ్లలో తాము పది వేల మంది మహిళలు, పిల్లలకు సహాయం అందించినట్లు తెలిపారు. బాధితులు న్యాయం పొందడంలో, కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో భరోసా సిబ్బంది సహాయంగా ఉన్నారన్నారు. వారి నిస్వార్థ సేవకు తామంతా వందనం చేస్తున్నట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు.