అహ్మదాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్లోని సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దాఖలైంది. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన కేసులో తుది వాంగ్మూలం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 2019, ఏప్రిల్ 13న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీ, నీరవ్ మోదీ పేర్లను ప్రస్తావిస్తూ.. ‘దొంగలందరీకి మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంది’ అంటూ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత, సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ తన మాటలతో మోదీ ఇంటి పేరున్న వారందరీ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.