హైదరాబాద్ : నగర సుందరీకరణకు జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు వినూత్న చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్లో ఏర్పాటు చేసిన వాటర్ బాటిల్ మోడల్ డస్ట్ బిన్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. తాగి పడేసే వాటర్ బాటిల్స్తో హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా ఉండేందుకు పౌరుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ వీటిని ఏర్పాటు చేసింది.