సూర్యాపేట: జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను మరికాసేపట్లో మీడియా ముందు హాజరుపరుచనున్నారు.