మార్కెట్కు అదనంగా పదెకరాల స్థలం కేటాయింపు
ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 6: చల్గల్ మ్యాంగో మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. మార్కెట్కు అదనంగా చల్గల్ వాలంతరీ కేంద్రం నుంచి పదెకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని అడుగగానే కేటాయించినట్లు తెలిపారు. మంగళవారం వాలంతరీ కేంద్రంలోని స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో మార్కెట్ను ఈ సీజన్కు అందజేయడానికి కృషి చేశామని, కా నీ కరోనా లాక్డౌన్ తదితర కారణాల వల్ల కొంత ఆలస్యమైందని, ప్రభుత్వం సైతం మార్కెట్ అభివృద్ధికి నిధులు కేటాయించిందన్నారు. రాబోయే రోజుల్లో జగిత్యాల పండ్ల మార్కెట్ నుంచి దేశ విదేశాలకు సైతం ఎగుమతులు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. మార్కెట్కు అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పనులను త్వరితగతిన పూర్తి చేసి వ్యాపారాలు సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొలుగూరి దామోదర్రావు, ఎంపీపీ గంగారాం గౌడ్, ఎల్లా గంగనర్సు, రాజన్న, ఏఎంసీ డైరెక్టర్లు మోహన్రెడ్డి, రవి, మల్లన్న, నాయకులు ఆనంద్రావు, సోహెల్, మార్కెటింగ్ ఏడీ ప్రకాశ్, డీడీఏ సునీత, డీఈ మునీందర్ తదితరులు పాల్గొన్నారు.