కల్పవృక్షం.. కాపాడుకుందాం

- కుల.. మత.. ప్రాంత.. అమీర్.. గరీబ్ భేదం లేకుండా ఉపాధి
- కండ్ల ముందే కదలాడుతున్న కరోనా వైరస్ చేదు అనుభవాలు
హైదరాబాద్ మహానగరం నిరుద్యోగుల, చిరుద్యోగుల కలలు నిజం చేసే గొప్ప నగరం. చదివిన చదువుకు సరైన ఉద్యోగం, సంపాదన లభించక అనేక సమస్యలతో సతమతమయ్యే వారికి నగరం గమ్యస్థానం. పేదల కడుపు నింపే కార్ఖానా. జీవితంలో ఎత్తుకు ఎదగాలనుకునేవారికి వెన్నుతట్టి అండగా నిలబడే నగరం. ఎన్నో ఆశలు..ఆశయాలతో వచ్చే వారిని అమ్మలా ఆదరించి.. లక్షలాది మందికి అన్నపూర్ణగా కడుపునింపుతున్నది మన హైదరాబాద్. కుల, మత, బీద, గొప్ప ప్రాంతాలకు అతీతంగా ఆదరిస్తూ... అమ్మలా లాలిస్తున్న ఈ మహా నగరం కడుపులో విద్వేష చిచ్చు పుడితే.. భౌతికంగా నగరాన్ని మాత్రమే కాదు... కోట్లాది మంది ఉపాధికీ పెను ముప్పే . కరోనా చేదు అనుభవాలు కండ్ల ముందే కదలాడుతున్నా.. పచ్చని నీడలో చల్లగా ఉన్న ప్రాంతంలో మతతత్వ రూపంలో అగ్గి రాజేసే శక్తులు కాచుకు కూర్చున్నాయి.. వారికి ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పాలి. ప్రశాంత పతాక రెపరెపల్ని కాపాడుకోవాలి. మనకు జీవితాన్నిచ్చే, సంపదనిచ్చే కల్పవృక్షం ఏ చీకూ చింతా లేకుండా హాయిగా వర్ధిల్లేలా నిర్ణయాలు తీసుకోండి.
కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ నెలకు ఐదారు వేలు సంపాదించే ఓ సామాన్యుడు.. ఏటా లక్షల్లో వేతన ప్యాకేజీ తీసుకునే ఐటీ ఉద్యోగి.. బ్యూటీషన్గా నెలకు రూ.50వేలు సంపాదిస్తూ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చే ఒక గృహిణి.. కోట్లాది రూపాయల టర్నోవర్తో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక పారిశ్రామికవేత్త.. ఇలా ఒకరేమిటి! ఒకటేమిటి!! హైదరాబాద్లో లక్షలాది మంది అనేక రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. కంటి నిండా నిద్రపోతున్నారు. కుల, మత, ప్రాంత, బీద, బిక్కీ అనే తేడా లేకుండా అందరినీ ఆదరిస్తూ, లాలిస్తున్న ఈ మహా నగరం కడుపులో విద్వేష చిచ్చు పుడితే?! భౌతికంగా నగరాన్ని మాత్రమే కాదు.. కోట్లాది మంది ఉపాధిని దహించివేస్తుంది. ఆదమరిచి ఆ అగ్గికి సమిధలవుదామా? వేలికి సిరా అంటించుకొని అభివృద్ధికి విధాతగా మారుదామా? ఆలోచించండి... హైదరాబాద్ మహా నగర కల్పవృక్షం కలకాలం పచ్చగా ఉండేలా అడుగులు వేయండి.
ఉపాధి ఔషధం
హైదరాబాద్లో ఔషధాల తయారీ పరిశ్రమల వేళ్లూనుకుంది. గ్రేటర్లో పరిధిలో 280 వరకు బల్క్డ్రగ్ ఫార్మా కంపెనీలు, మరో 200 వరకు కెమికల్ కంపెనీలు, మరో 300 వరకు ఫార్ములేషన్ యూని ట్లు ఉండగా, మన రాష్ట్రంతో పాటు 16 రాష్ర్టాలకు చెంది న 1.5 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నాయి. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో 35శాతం హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. విదేశీ ఎగుమతుల్లో 20శాతం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో 120 కొత్త పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ నాలుగేండ్లలో సుమారుగా 100 బిలయన్ల పెట్టుబడులను నగరం ఆకర్షించగలిగింది.
ఐటీలో 5.82లక్షల మందికి ఉద్యోగులు..
దేశంలోనే అతి పెద్ద ఉద్యో గ, ఉపాధి అవకాశాల రంగమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)పై కొవిడ్ ప్రభావం మిగతా రంగాలతో పోల్చితే చాలా తక్కువే ఉంది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం అవకాశం ఉండడం తో అంతగా ఉద్యోగాల తొలిగింపు లేకుండాపోయింది. దేశంలోనే రెండో స్థానంలో హైదరాబాద్ ఐటీ రంగంలో దాదాపు 5.82లక్షల మంది పని చేస్తున్నారు. ఇందులో వర్టికల్స్ వారీగా చూస్తే, ప్రోగ్రామింగ్ అండ్ ప్రాజెక్టు డెలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, హెల్త్కేర్, టూరిజం వంటి వాటిలో టూరిజంపై పని చేసే ఉద్యోగులకు పని లే కుండాపోయింది. అదే సమయంలో హెల్త్కేర్ రంగానికి పని పెరిగింది.
10వేల హాస్టళ్లు.. 10లక్షల మందికి వసతి
దేశంలోనే హైదరాబాద్ మహానగరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇక్కడి వస్తున్నారు. అలాంటి వారికి ఇక్కడ 10వేల వసతి గృహాలు ఉన్నాయి. అధికంగా ఐటీ శిక్షణకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 2500 హాస్టళ్లున్నాయి. వీటిలో సుమారు 9లక్షల నుంచి 10లక్షల మంది వరకు వసతి పొందుతున్నారు.
కడుపు నింపే కార్ఖానా
మేడ్చల్, నమస్తే తెలంగాణ : ప్రపంచ కార్మికులకు అడ్డాగా మారిన హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో సుమారు 10లక్షలకు పైగా కార్మికులు బతుకుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 1500 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలుండగా, వీటిలో సుమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని మొత్తం 4,635 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో సుమారు 4.5 లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 5,224 సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలుండగా, వీటిలో సుమారు 4.5లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. సొంత రాష్ర్టాలో ఉపాధి కరువై, భారంగా వచ్చిన లక్షలాది శ్రామికులను హైదరాబాద్ అన్నం పెడుతున్నది. లాక్డౌన్ కాలంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తే, కార్మికుల నుంచి నయాపైసా తీసుకోకుండా వారి సొంత రాష్ర్టాలకు తెలంగాణ సర్కారు క్షేమంగా చేరవేసింది.
రవాణా కార్మికులకు సర్కారు భరోసా
హైదరాబాద్లో 60 లక్ష ల వాహనాలున్నాయి. ఆటో లు, క్యాబ్లు, లారీలు, డీసీఎం లు, ట్రాలీ, బస్సులపై ఆధారపడి సుమారు 4.30లక్షల మంది కార్మికులు బతుకుబండి నడిపిస్తున్నారు. కరోనాతో వాహనాలు రోడ్లెక్కక ఇంటికి పరిమితమయ్యా రు. ఫలితంగా నెలనె లా చెల్లించాల్సిన ఈఎంఐల భారం వారిపై పడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా నిలిచి, ఇటీవల రెండు త్రైమాసికాల వాహన మోటరు పన్ను రద్దు చేసింది. ఈ ఆరేండ్లలో రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్ ట్రాలీలకు పన్ను మినహాయింపునిచ్చింది. రాష్ట్రం ఏర్పడిన జూన్ రోండో తేదీ నాటికి ఈ వాహనాలకు సంబంధించి పేరుకుపోయిన రూ.76.26 కోట్ల పన్ను బకాయిలు రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రేటర్లోని లక్షలాది వాహన యజమానులు లాభపడ్డారు.
క్యాబ్లు, ఆటోలకు డిమాండ్..
1.40లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు, 1.20 లక్షల మంది ఆటో డ్రైవర్లున్నారు. నగరం నలుదిశలా అభివృద్ధి చెందుతుండటంతో ఉద్యోగుల సం ఖ్య పెరిగింది. దీంతో వారి రాకపోకలకు క్యా బ్లు, ఆటోలే కీలకంగా మారాయి. ఉబె ర్, ఓలా క్యాబ్ సర్వీస్లో చాలా మంది వాహనాలను రిజిస్టర్ చేసుకుని, రో జుకు 15 నుంచి 20 వరకు ట్రిప్పు లు చేస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని, సాధారణ డ్రైవ ర్లు సైతం వాహన రంగంలో ఉ పాధి పొందుతున్నారు. అటు ఉబెర్, ఓలా ఆర్డర్స్ తీసుకుంటూనే ఇటు సాధారణ గిరాకీ చేస్తున్నారు.
పారిశ్రామిక ప్రగతి
టీఎస్ ఐ-పాస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు గ్రేటర్కు క్యూ కడుతున్నాయి. పరిశ్రమలు తరలివెళ్తాయన్న దుష్ప్రచారాలను పటాపంచలు చేస్తూ హైదరాబాద్ పెట్టుబడుల గమ్యస్థానమైంది. ఇది వరకు వైజాగ్, విజయవాడ వైపు చూసిన పారిశ్రామికవేత్తలంతా ఇప్పుడు హైదరాబాద్నే ఎంచుకున్నారు. వాతావరణం, ప్రశాంతత, శాంతిభద్రతలను చూసి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికొస్తున్నాయి. ఈ ఐదేండ్లలో నాలుగు వేల పైచిలుకు కొత్త పరిశ్రమలొచ్చాయి. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో మూడు వేల పైచిలుకు కొత్త పరిశ్రమలు రావడం, సుమారుగా రెండు లక్షల కొత్త ఉద్యోగాలు దొరికాయి.
జగదీశ్ మార్కెట్తో 10వేల మందికి..
అర చేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ఫోన్ల విక్రయాలకు అడ్డాగా నగరంలోని జగదీశ్ మార్కెట్ సుపరిచితం. అంతర్జాతీయ బ్రాండ్స్ నుంచి మొదలు కొని అతి చిన్న కంపెనీల ఫోన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ 3వేలకు పైగా షాపులు ఉండగా, అందులో 10వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ స్మార్ట్ఫోన్లు కొనేందుకు వచ్చేవారు సుమారు 45 నుంచి 55వేల మంది దాకా ఉంటారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్రూప్ బజార్-అబిడ్స్
నగరంలో ఎంతో పురాతనమైన ఆర్థిక కేంద్రం ట్రూప్ బజార్. అటు కోఠి, ఇటు అబిడ్స్ ప్రాంతాలను కలుపుతూ ఈ ప్రాంతంలో భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువులతో పాటు ఎలక్ట్రికల్, శానిటరీ వేర్ ఉత్పత్తులు హోల్సేల్ ధరలకే విక్రయిస్తుంటారు. నగరవాసులే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. సుమారు 5వేలకు పైగా చిన్న, పెద్ద హోల్సేల్, రిటైల్ వ్యాపార సంస్థలు ఇక్కడ దశాబ్దాలు తరబడి కొనసాగుతున్నాయి. ఈ వ్యాపార కేంద్రంలో 25వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా, వారిపై ఆధారపడిన వారు లక్షల వరకు ఉంటారు.
కోఠి ఎలక్ట్రానిక్స్
హైదరాబాద్లో కోఠి అంటేనే ప్రధాన వ్యాపార కేంద్రం. నివాస ప్రాంతం కన్నా ప్రధాన వ్యాపార కేంద్రంగా వర్థిల్లుతోంది. రేడియో, టీవీలు మొదలుకొని రకరకాల ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఉత్పత్తుల విక్రయాలు, వస్ర్తాలు, మెడికల్ షాపులకు అవసరమైన మందులను సరఫరా చేసే ఏజెన్సీలు కోఠిలోనే ఉన్నాయి. కోఠి కేంద్రంగా చేసుకొని 10వేలకు పైనే షాపులు ఉండగా, వాటి ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతున్న వారు 5వేల మంది దాకా ఉంటారు.
రాణిగంజ్ అగ్రి బిజినెస్
అశాంతి నెలకొంటే ఆగమే!
15.50లక్షల మంది వీధి వ్యాపారులు
ఇక్కడ పనికి కొదువ లేదు
హైదరాబాద్లో జాబ్ అదృష్టం
అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్
జేబులో రూపాయి లేకున్నా ఆదుకుంటుంది
హైదరాబాద్ నా జీవితాన్ని మార్చింది
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు