హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది వినాయక చవితి సందర్భంగా హుస్సేన్సాగర్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు అమలు చేశామని, ఈ ఏడాది కూడా అదే విధంగా చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీనిపై పూర్తి వివరాలను నివేదించేందుకు గడువు కావాలని కోరింది. అందుకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.హుస్సేన్సాగర్లో వినాయక సందర్భంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం చేయరాదని గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు కాలేదని న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టుధికార కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ వాదనలు వినిపించారు.