కంటోన్మెంట్, ఆగస్టు 26: కరోనా నియంత్రణ కోసం కంటోన్మెంట్లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా బోర్డు పరిధిలోని ఆరో వార్డు గన్రాక్ ఎన్క్లేవ్ ఫేజ్-2లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం బోర్డు ఇంజనీరింగ్ అధికారి గోపాలకృష్ణ దాస్తో కలిసి కలెక్టర్ శర్మన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తయిన ఇండ్లను గుర్తించి స్టిక్కర్ అతికించాలన్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన మార్గమని, ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛందంగా వారు టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వ్యాక్సిన్ను వంద శాతం పూర్తిచేసి, కంటోన్మెంట్ను మొదటి స్థానంలో ఉంచాలని సూచించారు.
దేశంలో ఇప్పటి వరకు ఏ మెట్రో నగరంలో కూడా 100 శాతం అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు. మూడవ విడత కరోనా వేవ్ వచ్చే అవకాశం లేదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.