హైదరాబా ద్ మహా నగరాన్ని ఐటీ కేంద్రంగా నిలబెడుతున్న సాఫ్ట్వేర్ కంపెనీలు వ్యాక్సినేషన్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాయి. ఎంప్లాయీస్ ఆరోగ్యం కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నాయి. ఉచితంగా వ్యాక్సిన్ అందించేలా ప్ర ణాళికలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేయించాయి. ప్రస్తుతం మరిన్ని కంపెనీలు ఐటీ ఉద్యోగుల వ్యాక్సిన్కు చర్యలు తీసుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం పూర్తయ్యాక కా ర్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించాలంటే.. వ్యాక్సిన్ తీసుకోవడం చాలా కీలకం. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉం టేనే వర్క్లో రాణించగలరని కంపెనీలు వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. గ్రేటర్లో సుమారు 1550 సాఫ్ట్వేర్ కంపెనీలలో ఆరు లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అని కేంద్రం ప్రకటించడంతో కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్కు శ్రీకారం చుట్టాయి.
మాకు మొదటి ప్రాధాన్యత ఉద్యోగుల ఆరోగ్యానికే! వారి కోసం మేము ఎప్పుడు ముందుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ చాలా భయానక పరిస్థితులకు కారణమవుతుంది. చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అది మమ్మల్నీ చాలా కలిచివేస్తుంది. మా ఉద్యోగులందరికి వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించాం. వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ ఉంటుంది. క్లిష్ట సమయంలో ఎంప్లాయీస్కు అండగా నిలవడం ప్రధానం. – వంశీరెడ్డి, సీఈఓ, క్వాడ్రెంట్ రీసోర్స్
చాలా కంపెనీలు వారి ఉద్యోగుల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టడానికి ముందుకురావడం హర్షణీయం. కేంద్రం 18 ఏండ్లు నిండిన వారి నుంచి వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రకటించడంతో కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. వ్యాక్సిన్ కొరతతో చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు ముందుకొచ్చి వ్యాక్సినేషన్ చేపడతామని ప్రకటించడం గొప్ప విషయం. – సత్య, ప్రెసిడెంట్, ఎఫ్ఎంసిటీ