సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ) : నగరంలో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జిహెచ్ఎంసి ఉన్నతాధికారులను పలు కీలక సర్కిళ్లకు ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కమిషనర్ లోకేష్కుమార్ ఆదేశాలు జారీచేశారు.
చార్మినార్ సర్కిల్కు అడిషనల్ కమిషనర్ సంతోష్, చాంద్రాయణగుట్ట సర్కిల్ విజయలక్ష్మి, హయత్ నగర్ సర్కిల్ యాదగిరి రావు, సరూర్ నగర్ సర్కిల్ పంకజ, కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రియాంక అలా, అల్వాల్ సర్కిల్ జె.శంకరయ్య, ముషిరాబాద్ సర్కిల్ వి.కృష్ణ, అంబర్ పేట్ సర్కిల్ జయరాజ్ కెనడి, చందానగర్ సర్కిల్ చీఫ్ ఇంజినీర్ దేవానంద్, మెహిదీపట్నం సర్కిల్ సి.ఇ జియాఉద్దీన్, కార్వాన్ సర్కిల్ సి.ఇ వసంత లను నోడల్ అధికారులుగా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.
ఈ అధికారులు తమకు కేటాయించిన సర్కిళ్లలోని కాలనీలలో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హాజరై వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా పర్యవేక్షిస్తారని తెలిపారు.