ఎల్బీనగర్, సెప్టెంబర్ 3 : కొవిడ్ను సంపూర్ణంగా నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నామని సరూర్నగర్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య అన్నారు. మోహన్నగర్ శృంగేరీ కాలనీలో 100శాతం వాక్సినేషన్ చేసిన సందర్భంగా కాలనీ వారికి సర్టిఫికెట్ను అందజేశారు. ఈ సందర్భంగా హరి కృష్ణయ్య మాట్లాడుతూ.. సరూర్నగర్ సర్కిల్లో సంపూర్ణంగా వ్యాక్సినేషన్ను విజయవంతం చేస్తున్నామన్నారు. కాలనీ సంక్షేమ సంఘాల వారు, స్వచ్ఛంద సంస్థల మద్దతుతో సర్కిల్ వ్యాప్తంగా ఐదు డివిజన్లలోని అన్ని కాలనీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ప్రస్తుతం రెగ్యులర్గా మూడు కేంద్రాలతో పాటుగా మొబైల్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శృంగేరీ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కన్నయ్య ముదిరాజ్, మాణిక్రావు, కొత్తపేట డివిజన్ నోడల్ అధికారి రవీందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.