సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ ) : పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సుమారు 95 శాతం శానిటేషన్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రాజెక్టు హోప్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో మేయర్ సుమారు ఐదు వందల మంది కార్మికులకు మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్, సీఎంహెచ్వో అరుణ, హోప్ ప్రాజెక్టు ప్రతినిధులు శామ్యూల్ పట్టా, మెర్లిన్ తదితరులు పాల్గొన్నారు.