సిటీబ్యూరో, జూలై 3 (నమస్తేతెలంగాణ): మనిషి జీవితంతో మమేకమయ్యే అటవీ సం పద అభివృద్ధికి ప్రభు త్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కాలుష్య నియంత్రణతోపాటు మహానగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు విరివిగా ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నది. హెచ్ఎండీఏ పరిధిలో 16 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలోఅర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను ఏర్పాటు చేస్తుండగా,ఇటీవల పెద్దఅంబర్పేట కలాన్లో ఒక బ్లాక్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో 15 చోట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. రంగారెడ్డి, యాదాద్రి, మెదక్,మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 5928.38 హెక్టార్లలోరూ.73.52 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ పనులు చేపట్టారు.
అప్పుడు గుట్టలు.. ఇప్పుడు ఆహ్లాదం
గ్రేటర్ చుట్టుపక్కల పొదలు,చెత్తాచెదారంతో వృథాగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలను సీఎం కేసీఆర్ సూచనలకనుగుణంగా అర్బన్ లంగ్ స్పేస్లుగా మారుస్తున్నారు. రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ సాధించాలన్నది ప్రధాన లక్ష్యం. ఆహ్లాదంతోపాటు ఆటవిడుపు కేంద్రంగా ప్రధాన రహదారుల వెంట ముస్తాబు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను వంద నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలోపు ఏర్పాటు చేస్తున్నారు.