మన్సూరాబాద్, ఆగస్టు 26 : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం, కుంట్లూరు గ్రామానికి చెందిన బద్దం సత్యనారాయణ గౌడ్, జ్యోతి దంపతుల కుమార్తె ధనలక్ష్మి వివాహం ఇటీవల నిశ్చయమైంది. నిరు పేదలైన సత్యనారాయణ గౌడ్, జ్యోతి దంపతుల ఆర్థిక పరిస్థితిపై కొందరు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు.
విషయాన్ని తెలుసుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నాగోల్లోని తన నివాసంలో ధనలక్ష్మి వివాహానికి గాను పుస్తె, మెట్టెలు, చీర, గాజులు శ్రీనివాస్ గుప్తా, ఆయన సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో చైర్పర్సన్ ఉప్పల స్వప్న అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉప్పల ఫౌండేషన్ ద్వారా చేయూతనిస్తున్నామని తెలిపారు.