అమీర్పేట్ : ఈ నెల 4న శనివారం సనత్నగర్ కార్మిక సంక్షేమ కేంద్ర మైదానంలో జరిగే యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు హాజరు కావాలంటూ వేడుకల నిర్వాహకులు బుధవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు ప్రధాన వక్తగా పాస్టర్ ప్రకాష్ పాల్ విచ్చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షులు అధ్యక్షులు విలియమ్స్ మంత్రికి వివరించారు. వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని అసోసియేఫషన్ ప్రతినిధులకు సూచించారు.
మంత్రిని కలిసిన వారిలో సనత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి, అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రకాశ్, ప్రతినిధులు మోజెస్, ప్రణయ్, సైమన్ రాజ్, అనిల్ లాజరస్ తదితరులున్నారు.