కాచిగూడ,ఆగస్టు 18 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ బి.జీ.ప్రసాద్రావు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని యువకుడు(25) మంగళవారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ పార్సల్ కార్యాలయం సమీపంలో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు చొక్కపై పసుపుపచ్చ, నీలి, ఎరుపు రంగు గీతలు, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి, 5.8 ఎత్తు కలిగి ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా మృతుడి కుడి చేతికి రాగి కడియం ఉందని తెలిపారు. మృతి చెందిన యువకుని వివరాలు తెలిసిన వారు 9949326625లో సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.