ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 22 : దళారి వ్యవస్థను పూర్తిగా రూపుమాపడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని డీసీఎంఎస్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు పండించిన పంటలను దళారులకు విక్రయించి పూర్తిగా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలని తెలిపారు. కల్లాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం ఏ రకం ధాన్యం రూ.1888, బి రకం ధాన్యానికి 1868ల ధర అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్చైర్మన్ యాదగిరి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, ఏవో వరప్రసాద్రెడ్డి, కౌన్సిలర్లు బి.మంగ, బర్తాకి జగన్, నాయకులు మల్లేశ్, రవీందర్, జంగయ్య, జగదీశ్వర్, ఏఈవోలు రఘు, శ్రవణ్, డీసీఎంఎస్ అధికారులు పాల్గొన్నారు.
మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
మంచాల, ఏప్రిల్ 22 : పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మంచాల సహకార సంఘం కార్యాలయ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి, ఎంపీపీ జాటోతు నర్మదతో కలిసి వంగేటి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపీటీసీలు నరేందర్రెడ్డి, కావలి శ్రీను, డైరెక్టర్లు జెనిగ వెంకటేశ్, జనార్దన్రెడ్డి, దండేటికార్ సత్యనారాయణ, కందాల పద్మ, పల్లె జంగారెడ్డి, ఇన్చార్జ్ వ్యవసాయ శాఖ అధికారి స్దాతి, ఏఈవో లింగస్వామి, సీఈవో శ్రీనివాస్, సిబ్బంది రమేశ్ పాల్గొన్నారు.
ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి
శంకర్పల్లి, ఏప్రిల్ 22 : రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఎంతో కృషి చేశారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కొనియాడారు. గురువారం ఇంద్రారెడ్డి వర్ధంతిని శంకర్పల్లి ప్రధాన చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జి.గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.గోపాల్, వి.వాసుదేవ్కన్నాలు, నాయకులు కె.నారాయణ, జి.గోవర్ధన్రెడ్డి, గోపాల్రెడ్డి, సాత ప్రవీణ్కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్లో సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రవీందర్గౌడ్ ఇంద్రారెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాములమ్మ, కె.వెంకటేశ్, కిషన్సింగ్ పాల్గొన్నారు.
ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు కృషి చేద్దాం
శంకర్పల్లి రూరల్, ఏప్రిల్ 22 : శంకర్పల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతిని ఆయన అభిమానులు పలువురు రాజకీయ పార్టీల నాయకులు నివాళులర్పించారు.
వ్యాపారస్తుల నిర్ణయం హర్షణీయం
శంకర్పల్లి, ఏప్రిల్ 22 : శంకర్పల్లి పట్టణ వ్యాపారస్తులు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు తమ వ్యాపార సంస్థలు మూసి వేస్తామని నిర్ణయించుకోవడం హర్షణీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ వ్యాపారస్తులు ఎమ్మెల్యే సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూకు పూర్తి స్థాయిలో సహకరించాలనే ఉద్దేశంతో రెండు గంటల ముందుగానే తమ వ్యాపార సంస్థలు మూసి వేస్తామని వ్యాపారులు చెప్పడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బీ.వెంకట్రాంరెడ్డి, కమిషనర్ యాదగిరి, సీఐ గోపీనాథ్, వ్యాపారస్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
RGV దెయ్యం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా
తాజ్ హోటల్ సెట్ కోసం ఎందరు పనిచేశారో తెలుసా..?