బేగంపేట్ జూన్ 11: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవ ఉత్సవాలు, జాతర తేదీలను దేవదాయ శాఖ అధికారులు, ఆలయ కార్యనిర్వాహకులు ఖరారు చేశారు. జూలై 11న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు ప్రారంభమవుతాయని, అమ్మవారి జాతర 25, 26వ తేదీలలో నిర్వహించనున్నామనే విషయాన్ని శుక్రవారం మారేడ్పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి అధికారులు, అర్చకులు, పండితులు వివరించారు. ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు ఈవో గుత్తా మనోహార్రెడ్డి తెలిపారు.