కశ్మీర్ : జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరారు. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది. అదృష్టవశాత్తు జవాన్లు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా దళాలు త్రాల్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కుప్వారా జిల్లాలో గత ఆదివారం భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో 15కుపైగా ప్లాస్టిక్ స్టిక్స్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు జిల్లా పూంచ్లోనూ ఇటీవల జరిగిన తనిఖీ ఆపరేషన్లో రెండు తుపాకులు, 11 గ్రెనేడ్లను పట్టుకున్నారు. వీటిని నియంత్రణ రేఖ గుండా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.