హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేట్లో ఆగి ఉన్న డీసీఎంను ఓ బైకు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి శంబీపూర్ వైపునుంచి వస్తున్న బైకు.. బౌరంపేట సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో సూరారానికి చెందిన ప్రమోద్ రెడ్డి, వరంగల్కు చెందిన సునై రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.