సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్ చౌర్యం కేసుల్లో విధించిన జరిమానాలను ఆన్లైన్లోనే చెల్లించేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఇందుకు గాను వినియోగదారులు విద్యుత్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండాఇంటి నుంచే ఆన్లైన్లోనే చెల్లించే ప్రత్యేక విభాగాన్ని (పే యువర్ కేస్ అమౌంట్) ఏర్పాటు చేశారు. www.tssouthernpower.com వెబ్సైట్ హోం పేజీలో పే యువర్ కేస్ అమౌంట్ ఆప్షన్పై క్లిక్ చేయగానే పేమెంట్ చేసేలా సంస్థ ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.