రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్టీసీ కూడా కొవిడ్ కేర్ బస్సులను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీలైతే బస్సులలో కొవిడ్ రోగులకు వసతి కల్పించడంతో పాటు ఆక్సిజన్ కూడా అందించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కొవిడ్ వైరస్ నియంత్రణలో తమ వంతు సహా యం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు తెలిపారు. అయితే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాత స్పష్టతనిస్తామన్నారు.