సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ప్రయాణికులకు జీహెచ్ఎంసీ జోన్ అధికారులు శుభవార్త తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జోన్ పరిధిలో ఉన్న 207 రిజర్వేషన్ కౌంటర్లతో పాటు 41 బస్పాస్ కౌంటర్లు, ఐదు పార్సిల్ బుకింగ్ కౌంటర్లలో కూడా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు జోన్ ఈడీ వి.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 99592 26154, 8008204216, 99592 26160 సంప్రదించాలన్నారు.