సుల్తాన్బజార్, సెప్టెంబర్ 15: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం ఎంజీబీఎస్లో ఆకస్మికంగా పర్యటించారు. అంతకుముందు ఆయన తన వాహనంలో కాకుండా టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. బాధ్యతలు చేపట్టాక, మొట్టమొదటిసారిగా ఎంజీబీఎస్కు వస్తున్న క్రమంలో కండక్టర్లు ప్రయాణికులతో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకునేందుకు లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, అక్కడి నుంచి అఫ్జల్గంజ్, సీబీఎస్ వరకు మూడు బస్సుల్లో ప్రయాణించారు. సీబీఎస్ నుంచి కాలినడకన ఎంజీబీఎస్కు వచ్చి.. కలియతిరిగారు. పారిశుధ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఈడీ కార్యాలయంలో హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఈడీ ముణిశేఖర్, రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్, హెడ్ రీజియన్ ఆర్ఎం వెంకన్న, డీవీఎం ఎంఆర్సీ రెడ్డి, సీఆర్ఎం విష్ణువర్థన్రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.