కామారెడ్డి : కామారెడ్డి కలెక్టర్ ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్మెన్లు, వీఆర్ఏ, డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఈ నలుగురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలోని గుమాస్తా కాలనీ నుంచి కలెక్టరేట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగానే కలెక్టర్ వాహనం వెళ్లిపోవడంతో.. ఆ వాహనానికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.