ఉస్మానియా యూనివర్సిటీ : దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ను టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయ్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తనకు టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కేసీఆర్ను ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమకారుడిగా అనేక పోరాటాలు చేశానన్నారు.
పార్టీ విధేయుడిగా ఉంటూ, అన్ని ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేశానని చెప్పారు. తన పనితీరును గుర్తించిన పార్టీ అధిష్టానం టీఆర్ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిందని వివరించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాను పీహెచ్డీ చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని, తనకు అవకాశం కల్పిస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.