ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 11: విద్యార్థి నాయకుడికి ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించడం గొప్ప విషయమని వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సంఘాలు పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడికి దక్కిన అవకాశంపై వారు హర్షం వ్యక్తం చేశారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్హౌస్లో శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు ఖాయమని అన్నారు. గతంలో అనేక మంది విద్యార్థి నాయకులు పలు రాజకీయ పార్టీలలో పనిచేసినా వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయ అవసరాల కోసం వినియోగించుకున్నాయని మండిపడ్డారు.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు సైతం విద్యార్థులకు మొండిచేయి చూపెడుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ మాత్రం విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తుండటంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్కు మద్దతుగా బస్సుయాత్ర కూడా చేపట్టామని గుర్తు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఇవాళ దళిత సమాజంపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి దేశంలో మరెవరికీ లేదన్నారు. ప్రజలంతా దీనిని గమనిస్తున్నారని అభిప్రాయపడ్డారు. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రజలు గులాబీ జెండాకే పట్టం కడతారని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ, టీజీవీపీ, బీజేవీఎస్, టీఎంఎస్ఎఫ్, టీవీఎన్ఎస్, బీసీ విద్యార్థి సంఘం, అంసా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, యంకేవీఎస్, మాదిగ జేఏసీ, గిరిజన విద్యార్థి సంఘం తదితర సంఘాల నాయకులు శ్రీశైలం, డాక్టర్ రమేశ్ రాథోడ్, తప్పెట్ల ప్రవీణ్, నరేశ్, స్వామిగౌడ్, అర్జున్, కృష్ణ మాదిగ, రాజేందర్, గణేశ్, రవినాయక్, కోతి విజయ్, శిగ వెంకట్, చాప భాస్కర్, నవీన్గౌడ్ వేల్పుకొండ వెంకటేశ్, ఆవాల హరిబాబు, శ్రీకాంత్గౌడ్, దశరథ్, కొంపల్లి నరేశ్, జంగయ్య, కాటం శివ, రేణు, రామకృష్ణ, రవి, రమేశ్గౌడ్, సందీప్, రాజుయాదవ్, మధు పాల్గొన్నారు.