రాష్ర్టానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగర అభివృద్ధికి సీఎం కేసీఆర్,
టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది ఏడేండ్లలో అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు తీసింది. అందుకే సోమవారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇరవయ్యేండ్ల పండుగ సందర్భంగా ప్రవేశపెట్టిన తీర్మానాల్లోనూ నగరాభివృద్ధికి అద్దం పట్టేలా స్థానం కల్పించారు.
ప్రధానంగా మౌలిక వసతుల కల్పన అనేది గత ఏడు సంవత్సరాల్లో కనీవినీ
ఎరుగని రీతిలో సాగిందనేది అక్షర సత్యం. అందులోని ప్రధానాంశాలు కొన్ని…
దుర్గం చెరువు కేబుల్బ్రిడ్జి ఆసియాలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు. ఈ బ్రిడ్జి ద్వారా ప్రజలకు దూరభారం తగ్గడంతో పాటు సాయంకాలం జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా వినియోగం.
హైదరాబాద్ నగరంలో అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగురోడ్డుకు అదనంగా రీజినల్ రింగు రోడ్డుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు జిల్లాల నుంచి హైదరాబాద్కు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగు రోడ్డుకు 30 కిలోమీటర్ల అవతల, 348 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగు రోడ్డు నిర్మాణం. తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపు ఇవ్వనుంది.
హైదరాబాద్ నగరం నలుదిక్కులా వైద్య సేవల విస్తరణ కోసం తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (టిమ్స్) అనే పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని గచ్చిబౌలిలో మొదటి టిమ్స్ దవాఖాన ఏర్పాటు. ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ల్లో మరో మూడు టిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభం. ఇందు కోసం భూసేకరణ పనులు కూడా పూర్తయ్యాయి.
అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలకు రూ.5కే భోజనం అందిస్తుంది. ప్రస్తుతం 150 క్యాంటీన్లు, ప్రతిరోజూ 35వేల మందికి భోజనం అందిస్తున్నారు.
హైదరాబాద్లో పేదల కోసం ఇప్పటికే 226 బస్తీ దవాఖానల ఏర్పాటు.మరో 32 ప్రారంభానికి సిద్ధం. హైదరాబాద్లో ఒక్కో డివిజన్కు రెండు చొప్పున ఈ ఏడాది చివరికల్లా మొత్తం 300 బస్తీ దవాఖానల ఏర్పాటుకు నిర్ణయం.