చేవెళ్లటౌన్, జూలై 13 : ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేద కుటుంబాలను అదుకుంటున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 65 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే యాదయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడపడుచులకు వరం లాంటిదన్నారు. ఈ పథకం నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో ఆసరనిస్తున్నదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే కాలె యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శివారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, అర్డీవో వేణుమాదవ్ రావ్, తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో హరీశ్కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్లు బాన్, మల్లారెడ్డి, విజయలక్ష్మి నర్సింహులు, మాణిక్య రెడ్డి, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, శంకర్, ఊరెళ్ల గ్రామకమిటీ అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దేవుడు..లలిత, ఊరెళ్ల గ్రామం, చేవెళ్ల
కల్యాణలక్ష్మి ద్వారా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ దేవుడు. గతంలో ఏ ప్రభు త్వం కూడా ఇంతగా పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాకా కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 అందించి కుటుంబానికి తండ్రిలా నిలుస్తున్నాడు. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
నిధులు మంజూరు చేస్తా
రెడ్క్రాస్ సొసైటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని కాశీంబౌలి పంచాయతీ అనుబంధ గ్రామమైన నజీబ్నగర్లో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో పాల్గొన్నారు. ఎంపీపీ నక్షత్రం, సర్పంచ్ మహేందర్రెడ్డితో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన రెడ్క్రాస్ సొసైటీ అభివృద్ధికి రూ.10 లక్షలు నిధులు ఇస్తానని ఎమ్మెల్యే అన్నారు. సొసైటీ కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిత, మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, ఎంపీటీసీ మల్లేశ్, రెడ్క్రాస్ సొసైటీ సీఈవో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్మోహన్రావు, కోటిరెడ్డి, జిల్లా చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ పాండుగౌడ్, మాతాపిత్రుల సేవాసదనం చైర్మన్ కోశాధికారి శక్తి, సాయి యాదాద్రి సేవా ఆశ్రమం అధ్యక్షుడు అశోక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు జయవంత్ పాల్గొన్నారు.