కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో సబ్బండ వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి పరాయి పాలకుల నుంచి విముక్తి కలిగించడంతో పాటు స్వరాష్ట్రంలో ప్రజలందరూ ఆత్మ గౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబూరావు, డివిజన్ అధ్యక్షుడు దేవాది హరినాథ్, బొట్టు విష్ణు, అమ్రేశ్గౌడ్, వెంకటేశ్ చౌదరి, ప్రతాప్రెడ్డి, బండి సుధ, పాతూరి గోపి తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీలో.. కేపీహెచ్బీ కాలనీ డివిజన్ వసంతనగర్ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు మందలపు సాయిబాబా చౌదరి పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో శ్యామల రాజు, ఎర్ర నాగేశ్వర్రావు, రాణాప్రతాప్, కుమార్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లో..కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లో టీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు జనగాం సురేశ్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గౌరవరపు హన్మంతరావు, కట్టా నరసింగరావు, షేక్ గఫూర్, పిడికిటి గోపాల్ చౌదరి, అల్లూరి సుబ్బరాజు, శ్రీనివాస్రావు, రాచకొండ భాస్కర్ నాయీ, శ్రీరాంమూర్తి, వలవల నాయుడు, రాముడు, నర్సయ్య, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
ఫతేనగర్లో.. బాలానగర్, ఏప్రిల్ 27 : ఫతేనగర్ డివిజన్ పరిధి శోభనకాలనీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షుడు కె. భిక్షపతి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు సతీశ్, సురేందర్నాయుడు, చౌకత్, కృష్ణకుమారి పాల్గొన్నారు.
బాలానగర్లో కూకట్పల్లి, ఏప్రిల్27: బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కార్యాలయం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ శ్రేణులు నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు మందడి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎడ్ల మోహన్ రెడ్డి, పంజా రాంచందర్ ముధిరాజ్, మహ్మద్ ఖాజ, మహ్మద్ బాబా, నర్రా దేవేందర్ రెడ్డి, ఆంజనేయులు, దాసరి నగేశ్, బీఎన్ స్వామి, నాగేందర్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, ప్రేమ్కుమార్, చంద్రశేఖర్ గుప్త, అభిమన్యు, రామచంద్రాచారి, సుధాకర్ రెడ్డి, సాయి గౌడ్ పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్లో.. మియాపూర్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఆల్విన్ కాలనీ డివిజన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ యువనాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిన్నోళ్ల శ్రీను, రాములు, వాసు, బాలస్వామి, సమద్, అగ్రవాస్, జగదీశ్, ఖాజా, శ్రీనివాస్, సాయి, రవీందర్, చాంద్ పాల్గొన్నారు.