బంజారాహిల్స్,ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్నగర్ డివిజన్ల పరిధిలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్లోని తన నివాసం వద్ద జెండా ఎగురవేశారు.
ఫిలింనగర్లోని శంకర్విలాస్ చౌరస్తాలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్, మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణ జెండా ఎగురవేశారు. ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో కార్పొరేటర్ విజయారెడ్డి, సోమాజిగూడలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె.ప్రసన్న రామ్మూర్తి జెండా ఎగురవేశారు.
హిమాయత్నగర్, ఏప్రిల్27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నారాయణగూడలో మాజీ కార్పొరేటర్ జె.హేమలత యాదవ్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జె.బాబు యాదవ్, డి. రాజేందర్ కుమార్, వెంకట్ రమణ, గణేశ్, మధు, కృష్ణయాదవ్, ఇక్బాల్, పట్నంఅరుణ, సత్య నారాయణ, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీనగర్కాలనీ, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు బంగారు తెలంగాణ సాధనకు టీఆర్ఎస్ కృషి చేస్తున్నదని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మన్నె గోవర్ధన్రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నందినగర్ మైదానంలో పార్టీ పతాకావిష్కరణలో వారు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు నిరాబండబరంగా జరుపుకొన్నాయి. బోరబండ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ స్థానిక బస్టాండ్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, పార్టీ నేతలు జి.లక్ష్మణ్గౌడ్, ఎన్.విజయ్కుమార్, ఎం.ఆనంద్కుమార్, మధు, శంకర్, జి.చక్రపాణి, ఆనంద్, రమేశ్ నాయక్, హెచ్.రమేశ్యాదవ్, ఎండీ యూసుఫ్, ఖలీల్ , సుధాకర్, లడ్డూ తదితరులు పాల్గొన్నారు. బంజారానగర్, వీకర్సెక్షన్లో కూడా పార్టీ జెండాలను బాబా ఫసియుద్దీన్ ఆవిష్కరించారు. ఎర్రగడ్డ డివిజన్లో ఎమ్మెల్యే గోపీనాథ్ సూచన మేరకు పార్టీ డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ పలు ప్రాంతాల్లో గులాబీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలు మల్లేశ్, మహ్మద్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ భవిష్యత్ ఉందని శ్రీనగర్కాలనీ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ, ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నేతృత్వంలో యూసుఫ్గూడ, రహ్మత్నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్లలో టీఆర్ఎస్ శ్రేణులు పతాకావిష్కరణలు చేపట్టారు. మిఠాయిలు పంచుకున్నారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, శ్రీ కృష్ణానగర్ లేబర్ అడ్డా, యూసుఫ్గూడ బస్తీ సర్కిళ్లలో, డివిజన్ ప్రధాన కార్యదర్శి నర్సింగ్దాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు కైసర్ జాన్, రవి, సత్యనారాయణ, వేణుగోపాల్, నాగరాజు, యూత్ సెల్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.