నగరం గులాబీమయమైంది. స్వరాష్ర్టాన్ని సాధించి సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న గులాబీ శ్రేణులు జెండా పండుగను ఘనంగా నిర్వహించాయి. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన పురస్కరించుకొని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం గ్రేటర్వ్యాప్తంగా ‘గులాబీ జెండా పండుగ’ ఘనంగా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఏరియా కమిటీ సభ్యులు ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఆవిష్కరించారు. పలుచోట్ల కార్యకర్తలు బైక్ర్యాలీలు నిర్వహించి జెండా పండుగను హోరెత్తించారు. ప్రజలు టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా ఆదరిస్తున్నారని, 60 ఏండ్లలో జరగని మార్పు..ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు.
పలుచోట్ల జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన గ్రేటర్వ్యాప్తంగా కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈనెల 20వ తేదీలోపు పార్టీ వార్డు, డివిజన్, జిల్లా కమిటీలను నియమిస్తామని, కష్టపడే ప్రతిఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరమంతా గులాబీమయమై పండుగ వాతావరణం తలపించింది. కాలనీలు, బస్తీల్లోని వాడవాడలా గులాబీ జెండా రెపరెపలాడింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో వీధులన్నీ మారుమోగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహిస్తున్న శుభ తరుణంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన కూడళ్లతో జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, వార్డు, ఏరియా, బూత్ కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో కూడిన గులాబీ దండు జెండా పండగను ఘనంగా నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పండుగ వేడుకలను పార్టీ శ్రేణులు వైభవంగా జరుపుకొన్నారు. నగరంలోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
మొదటగా సనత్నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద మంత్రి తలసాని టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని సోమాజిగూడలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్నానగర్లో, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో పటేల్ నగర్ చౌరస్తాలో, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో, కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని గుడిమలాపూర్లో నియోజకవర్గం ఇన్చార్జి జీవన్ సింగ్, మాజీ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ ఆధ్వర్యంలో, నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని మెహిదీపట్నంలో నియోజకవర్గం ఇన్చార్జి ఆనంద్ గౌడ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆధ్వర్యంలో, గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని బేగంబజార్ ఛత్రిలో నందుబిలాల్ ఆధ్వర్యంలో, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బోరబండ చౌరస్తాలో నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్యాదవ్ పాల్గొని గులాబీ జెండాను ఎగురవేశారు.
అదేవిధంగా ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, ఇతర కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్ పాల్గొన్నారు. షేక్పేట డివిజన్ నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వేలాది మంది కార్యకర్తలతో కలిసి బైక్ర్యాలీ నిర్వహించారు. షేక్పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్, బోరబండ, రహ్మత్నగర్ ప్రాంతాల మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో భాగంగా జై తెలంగాణ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆవిర్భవించిన పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం పలు చోట్ల నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహిస్తున్న ఈ శుభ తరుణంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగర పరిధిలోని అన్ని డివిజన్లు, నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు.
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ‘స్వయం పాలన రావాలి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి’ అప్పుడే తెలంగాణ ప్రాంత అభివృద్ధి సాధ్యమని నాటి ఉద్యమకారుడు.. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని అన్నారు. 74 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఒక కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికే దకుతుందని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తమ ఇంటి పార్టీగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.