నేరేడ్మెట్, అక్టోబర్ 26: ఆధ్యాత్మిక చింతనే ముక్తికి మార్గమని త్రిదండి దేవనాథ్ జీయర్స్వామి అన్నారు. మంగళవారం ఆనంద్బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆయన విచ్చేశారు. భగవత్ తత్వాన్ని వివరిస్తూ భక్తి వైభవాన్ని రామానుజులవారు లోకానికి అందించిన విశిష్ట అద్వైత తత్వాన్ని అనుగ్రహ భాషనం చేశారు. శంషాబాద్ సమీపంలోని ముంచింతల్ శ్రీరామ నగరంలో రామానుజ సహస్రాబ్ధి సమారోహం పురస్కరించుకుని 1035 కుండ శ్రీ లక్ష్మీనారాయణ మహా క్రతువు 108 దివ్వ తిరుపతుల ప్రతిష్ట, స్వరమయ రామానుజ విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమాలు ఫిబ్రవరి 2, 2022 నుంచి 14వ తేదీ వరకు 12 రోజులపాటు జరగనున్నాయన్నారు.
ప్రతి ఒక్కరూ పాల్గొ ని భగవత్ అనుగ్రహాన్ని పొందాలని పేర్కొన్నారు. శక్తి కలవారు యజ్ఞయాగాదులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహనాధికారి ఏబీ రవీంద్రా రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ముడుంభై వెంకటరమణా చార్యులు, అర్చకులు తులసి వెంకటరమణా చార్యులు, క్లర్క్ సండ్ర సుధాకర్, ఆలయ మాజీ చైర్మన్లు ఉమేశ్ సింగ్, సంతోశ్ ముదిరాజ్, ధర్మకర్తలు పి. గణేశ్, రవీందర్, ఆలాపన, వేద పండితులు పరకాల స్వామి, భక్తులు సూర్య కుమారి, దేవి, మాధవి, కళ్యాణి వరదరాజులు, పాల్గొన్నారు.