కాచిగూడ,ఆగస్టు 29 : ఎంఎంటీఎస్ రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని మహిళ (50)ఆదివారం మలక్పేట రైల్వేస్టేషన్ల సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది.
దీంతో ఆమె రెండు కాళ్లు విరిగాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆర్యోగం నిలకడగానే ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.