మారేడ్పల్లి, సెప్టెంబర్ 5 : పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుండ్ల పోచంపల్లి-గౌడవెల్లి రైల్వే స్టేషన్ల మధ్యన గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఉదయం పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి వయసు సూమారు 35-40 సంవత్సరాలు ఉంటాయని, ఒంటి పై తెలుపు రంగు చొక్క, బూడిద రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మృతుడి సంబంధీకులు ఏవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.