హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్బండ్పై పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దని పోలీసులు సూచించింది.
అప్పర్ ట్యాంక్బండ్ నుంచి వచ్చే వాహనాలకు లిబర్టీ వైపు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అప్పర్ ట్యాంక్బండ్ నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.
బషీర్బాగ్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వైపు పంపనున్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించే అవకాశం ఉండటంతో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి