సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయం సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
-పూజల సందర్భంగా మహంకాళి ఆలయం, టొబాకోబజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్లో ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపివేసి, రోడ్లను మూసివేస్తారు.
-సుభాష్ రోడ్, బాటా చౌరస్తా నుంచి రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న మార్గాలను మూసివేస్తారు.
-అడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం మార్గాలను మూసివేస్తారు.
-జనరల్ బజార్ నుంచి ఆలయం మార్గం రోడ్డు మూసివేస్తారు.
– కర్బల మైదాన్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను రాణిగంజ్ ఎక్స్ రోడ్డు నుంచి మినిస్టర్ రోడ్డు, రసూల్పురా క్రాస్ రోడ్స్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, జాన్స్ రోటరీ, గోపాలపురం లేన్, రైల్వే స్టేషన్ వైపు దారి మళ్లిస్తారు.
-ఆర్టీసీ బస్సులు రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లేందుకు అల్ఫా ఎక్స్ రోడ్డు హోటల్, గాంధీ ఎక్స్ రోడ్స్, సజ్జనాల స్ట్రీట్, ఓల్డ్ మహంకాళి ట్రాఫిక్ పీఎస్, ఘాస్మండి, , బైబుల్ హౌస్, కర్బల మైదన్ రూట్లో వెళ్లాలి.
-తాడ్బన్ వెళ్లే బస్సులు క్లాక్టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ, ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ మీదుగా వెళ్లాలి… బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఘాస్మండి ఎక్స్ రోడ్డు నుంచి సజ్జన్నాల్ స్ట్రీట్, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లిస్తారు.
-ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, ప్యారడైజ్ వైపు దారి మళ్లిస్తారు.
-ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీహెచ్, క్లాక్ టవర్ వైపు మళ్లిస్తారు.
-క్లాక్ టవర్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యాట్సీ ఎక్స్ రోడ్డు నుంచి ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్డు, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు.
-సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు వద్ద హెచ్డీఎప్సీ బ్యాంకు, సింధి కాలనీ, మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు.