హైదరాబాద్: ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 2021– 23 విద్యాసంవత్సరానికి పీజీడీఎం జనరల్, పీజీడీఎం ఇన్ఫ్రాస్ర్టక్చర్ మేనేజ్మెంట్, ఇండస్ర్టీయల్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్మేనేజ్ కోర్సులను ప్రవేశపెట్టామని, అత్యాధునిక వ్యవస్థ, నిష్ణాతులైన ఫ్యాకల్టీ, వంద శాతం ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు జూన్ 15 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. ఇతర వివరాలకు 9490116179, 9949004788 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
వెబ్సైట్: www.escihyd.org, www.esci.edu.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి