వివాహనంతరం సినిమాల వేగం పెంచింది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. కథాంశాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటూ పాత్రలపరంగా వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాగార్జున జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. ప్రవీణ్సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ ‘రా’ ఏజెంట్గా శక్తివంతమైన పాత్రను పోషిస్తోందట. దేశ రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే ధీశాలి అయిన మహిళగా ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుందని చెబుతున్నారు. ఎంతటి భావోద్వేగాలనైనా తనలోనే అణచుకుంటూ దేశభక్తితో వృత్తినే దైవంగా భావించే గూఢచారి పాత్రలో ఆమె నటన సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. కాజల్ కెరీర్లోనే సవాలుతో కూడుకున్న పాత్ర ఇదని..దీనికోసం ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిసింది. ఇటీవలే ఈ చిత్రం గోవాలో ఓ షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ను హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోంది కాజల్ అగర్వాల్.