వరంగల్ : బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు.
అంబేద్కర్ జయంగి సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశాడన్నారు. ఈ రోజు మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామంటే.. ఆ పుణ్యం అంబేద్కర్దేనని అన్నారు.
సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా పాలన అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.