సుల్తాన్బజార్ : టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్పోర్ట్స్ మీట్కు అనుమతి ఇవ్వాలని హైద రాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్కు శుక్రవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యేడాది ఉద్యోగులకు మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు గాను టీఎన్జీవో హైదరాబాద్ జిల్లాశాఖ నిర్వహిస్తున్న క్రీడాపోటీలకు అనుమతిని ఇవ్వాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. విషయమై కలెక్టర్ శర్మన్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు సదానంద్ పాల్గొన్నారు.