మహేశ్వరం : టిప్పర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీశైలం హైవేపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. మహేశ్వరం సీఐ మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం కందుకూరు నుండి తుక్కుగూడ వైపు వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి కల్వర్టును డీకొనడంతో టిప్పర్ పల్టీకొట్టి డ్రైవర్ ఎరగడిండ్ల శేఖర్ (28) టిప్పర్ క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.